హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒడిశాకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఒడిశా సీఎం మోహన్ చరణ్ తో భట్టి విక్రమార్క భేటీకానున్నారు. ఒడిశాలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టనున్న నైని బొగ్గు బ్లాక్ తవ్వకాలకు అనుమతులు, విద్యుత్ ఉత్పత్తిపై చర్చించనున్నారు. ఒడిశా నైని బొగ్గు బ్లాక్ అనుమతులు సాధిస్తే సింగరేణికి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. 2015లో సింగరేణి కొలీరీస్ కంపెనీ లిమిటెడ్ కి నైని బొగ్గుగని కేటాయించింది. నైని బొగ్గు గని 10 ఎమ్ టీపీఏ గరిష్ట స్థాయి సామర్థ్యం కలిగిఉంది.