18-02-2025 07:25:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని చించోలి ప్రభుత్వ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మూలిక సదుపాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులకు మంచి మార్కులు తెచ్చుకునేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది ఉన్నారు.