నిర్మల్ (విజయక్రాంతి): సోన్ మండలంలోని జాబ్రాపూర్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9 గంటలకి పాఠశాలకు చేరుకున్న డీఈవో ఉపాధ్యాయులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులతో మాట్లాడి పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రత్యేక కార్యచరణతో ముందుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పరమేశ్వర్ ఉపాధ్యాయులు ఉన్నారు.