calender_icon.png 28 September, 2024 | 8:54 AM

నల్లవాగులో అక్రమ నిర్మాణాల కూల్చివేత

28-09-2024 02:12:19 AM

సంగారెడ్డి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి)/ సదాశివపేట: సదాశివపేట మండలంలోని నాగన్స్‌పల్లిలోని నల్లవాగును అక్రమించి శిల్ప వెంచర్ ఏర్పాటు చేశారని కలెక్టర్‌కు ఇటీవల ప్రజలు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వే చేసి అక్రమలు తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు నల్లవాగు విస్తీర్ణం 20 మీటర్లు, బఫర్ జోన్ 18 మీటర్లుగా గుర్తించారు. శిల్పా వెంచర్ యాజమాన్యం అక్రమంగా వాగును అక్రమించి వెంచర్ వేసిందని గుర్తించి, శుక్రవారం అక్రమ కట్టడాలను బుల్డోజర్‌తో కూల్చివేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.