05-03-2025 12:00:00 AM
పటాన్చెరు, మార్చి 4 : అమీన్ పూర్ మండల పరిధిలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చివేశారు. సర్వేనంబర్ 673 ప్రభుత్వ భూమిలో నిర్మించిన పలు కట్టడాలను ఉప తహసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్, ఆర్ ఐలు రఘునాథ్ రెడ్డి, శ్రీమాన్ రాజు జేసీబీతో నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.