బెల్లంపల్లి (విజయక్రాంతి): కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా చేపట్టిన బ్రిడ్జిని ఆదివారం సాయంత్రం ఇరిగేషన్ అధికారులు ఎక్సవేటర్ తో రెండు వైపులా కూల్చి వేశారు. కొద్దిరోజుల కిందట స్థానికంగా ఉన్న చర్చి నిర్వాహకులు తమ వేదిక వద్దకు వెళ్లేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ వ్యవహారంపై ఒక పార్టీకి చెందిన నాయకుడు పెద్ద ఎత్తున బెల్లంపల్లిలో ఆందోళన చేశాడు. నెట్టింట్లో వైరల్ కావడంతో పాటు పలు పత్రికల ద్వారా విషయం వెలుగులోకి రావడంతో అధికారులు దీనిపై స్పందించారు. ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు బ్రిడ్జి రెండు వైపులా నిర్మాణాన్ని కుల్చివేశారు. అయితే బ్రిడ్జిని పూర్తి దశలో కూల్చివేయాలని పలువురు కోరుతున్నారు.