జర్నలిస్టుకు దేహశుద్ధి.. పోలీసులకు అప్పగింత
పటాన్చెరు, సెప్టెంబర్ 28: హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ జర్నలిస్టుకు స్థానికులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఓ దినపత్రిక (విజయక్రాంతి కాదు)లో జర్నలిస్టుగా పనిచేస్తున్న సంతోశ్నాయక్ శనివారం ఐలాపూర్కు వెళ్లాడు.
నిర్మాణ దశలో ఉన్న ఇండ్ల ఫోటోలు తీశాడు. ఒక్కో ఇంటికి రూ.25 వేల చొప్పున తనకు చెల్లించాలని డిమాండ్ చేశాడు. లేకపోతే హైడ్రాకు ఫిర్యాదు చేసి కూల్చివేయిస్తానని బెదిరించాడు. దీంతో యజమానులు సంతోశ్నాయక్ను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించి, ఫిర్యాదు చేశారు.