calender_icon.png 3 October, 2024 | 5:58 AM

ఐఫోన్ ఆర్డర్ చేసి.. డెలివరీ బాయ్ హత్య

02-10-2024 01:41:53 AM

లక్నోలో ఇద్దరు యువకుల కిరాతకం

లక్నో, అక్టోబర్ 1: ఐఫోన్ డెలివరీ చేసేందుకు వెళ్లిన బాయ్‌ను ఇద్దరు అతి కిరాతకంగా చంపేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అనంతరం అతన్ని మృతదేహాన్ని సమీపంలోని కెనాల్‌లో పడేశారు. యూపీ రాజధాని లక్నోలో ఓ వ్యక్తి రూ.1.5 లక్షలు విలువ చేసే ఐఫోన్‌ను క్యాష్ ఆన్ డెలివరీ కింద బుక్ చేశాడు. సెప్టెంబర్ 23న ఐఫోన్‌ను డెలివరీ చేసేందుకు 30 ఏళ్ల భరత్ సాహు చిన్‌హట్‌లోని వినియోగదారుడు గజానన్ వద్దకు వెళ్లాడు.

కానీ ఆ కస్టమర్, అతని స్నేహితుడు ఆకాశ్ కలిసి డెలివరీ బాయ్‌ను చంపేసి సమీపంలోని ఇందిరా కెనాల్‌లో పడేశారు. సాహు ఇంటికి తిరిగి రాకపోవడంతో రెండ్రోజుల తర్వాత పోలీస్‌స్టేషన్‌లో అతని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కాల్ రికార్డులను పరిశీలించగా గజానన్, ఆకాశ్ గురించి తెలిసింది. వీరిని అరెస్టు చేసి విచారించగా సాహును గొంతునులిమి చంపినట్లు ఒప్పుకున్నారు. అయితే సాహు మృతదేహం ఇంకా లభించలేదు.