కార్తీ, లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన చిత్రం ‘ఖైదీ’. రాత్రి నుంచి తెల్లవారే వరకూ ఏం జరిగిందనే ఒక ఆసక్తికర కథాంశాన్ని చిత్రంగా తీసి లోకేష్ కనగరాజ్ మంచి హిట్ కొ ట్టారు. ఈ చిత్రం పార్ట్ 2కి సంబంధించి చిన్న హింట్ అయితే సినిమా చివరిలో వదిలారు. అయితే ఆ తరువాత ఐదేళ్లు గడుస్తున్నా అతీగతీ లేకపోవడంతో అంతా మరిచిపోయారు.
తాజాగా లోకేష్ కనగరాజ్ పార్ట్ 2కి సంబంధించి ఓ పోస్ట్ పెట్టి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారి దిల్ ఖుష్ చేశారు. “అంతా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. కార్తీతో పాటు ఎస్ఆర్ ప్రభుకు థ్యాంక్స్. వీరి వల్ల లోకేష్ యూనివర్స్ పాసిబుల్ అయ్యింది. త్వరలో ఢిల్లీ వస్తున్నారు” అని లోకేష్ పోస్ట్ పెట్టారు. ఢిల్లీ అంటే ‘ఖైదీ’ చిత్రంలో కార్తీ పేరు. దీంతో ఖైదీ ఉందంటూ లోకేష్ అధికారిక ప్రకటన చేసినట్టుంది.