న్యూ ఢిల్లీ: ఢిల్లీ నూతన సీఎంగా అతిశీ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై తన కున్న గౌరవాన్న చాటుకున్నారు. ఆయన కోసం పక్కన కుర్చీని ఖాళీగా ఉంచి తాను వేరే సీట్లో కూర్చుని బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆప్ ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది.