23-04-2025 01:35:09 AM
లక్నో, ఏప్రిల్ 22: ఐపీఎల్ 18వ సీజన్లోమంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుం ది. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మార్కరమ్ (52) టాప్ స్కోరర్గా నిలవగా..
మిచెల్ మార్ష్ (45) రాణించాడు.అనంతరం ఛేదనలో ఢిల్లీ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 161 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ (51), కేఎల్ రాహుల్ (57 నాటౌట్) రాణించారు. నేడు ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.