calender_icon.png 21 October, 2024 | 4:28 PM

సియోల్‌లో మంత్రులు, అధికారుల బృందం పర్యటన

21-10-2024 01:26:51 PM

హైదరాబాద్: దక్షిణకొరియాలో మంత్రులు, అధికారుల బృందం పర్యటిస్తోంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సియోల్ లో పర్యటిస్తున్నారు. సియోల్ లో ఎంపీ చామల, మేయర్, ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ అధికారులు పర్యటన కొనసాగుతోంది. సియోల్ లోని మాపోలో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే కేంద్రాన్ని మంత్రుల బృందం సందర్శించింది. రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి విద్యుదుత్పత్తి అవుతోంది. సియోల్ నగరపాలక సంస్థ వ్యర్థాల రీసైక్లింగ్ కు వేస్ట్ టు ఎనర్జీ టెక్నాలజీ వాడుతోంది. పర్యావరణంపై దుష్ప్రభావం పడకుండా ఆధునిక సాంకేతికత వినియోగిస్తోంది. మరో పదేళ్లలో సియోల్ నగర పాలక సంస్థ భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ నిర్మిస్తుంది.