హైదరాబాద్,(విజయక్రాంతి): బేగంపేట విమానాశ్రయానికి రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేరుకున్నారు. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ లో దేశంలోనే రెండో అతిపెద్ద వీఎల్ఎఫ్ నేవీ రాడార్ ప్రాజెక్టుకు రాజ్ నాథ్ సింగ్ మంగళవారం మధ్యాహ్నం శంకుస్థాపన చేయనున్నారు. రాజ్ నాథ్ సింగ్ కు కిషన్ రెడ్డి, బండి సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. టేకులబిడు తండా సమీపంలో భూమిపూజ కోసం శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. రాడార్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు.