కరీంనగర్ సిటీ, జనవరి31 (విజయ క్రాంతి): అంకితభావం.. నిబద్ధత.. విధుల నిర్వహణలో అత్యుత్తమంగా సేవలు.. 34 ఏళ్ల పాటు వివిధ జిల్లాల్లో ఉద్యోగ బాధ్యతల నిర్వహణ.. ఎక్కడ పనిచేసినా తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర కనపరిచాడు ఏపీఆ ర్ఓ వీరాంజనేయులు. సౌమ్యునిగా పేరు పొందారు. .
జనవరి 31వ తేదీ శుక్రవారం రోజున ఆయన ఉద్యోగ విరమణ చేశారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సన్మాన కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ ఏ డి లక్ష్మణ్ మాట్లాడుతూ వీరాంజనేయులు సమాజసేవయే ఊపిరిగా ప్రజాహితమే ల క్ష్యంగా విధులు నిర్వర్తించారన్నారు. ఉద్యోగ జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని వాటి తట్టుకుంటూ ముందుకు సాగారని.
నీతి, నిజాయితీగా వ్యవహరిస్తూ పారదర్శ కంగా బాధ్యతలు నిర్వహించారన్నారు. స మాచార పౌర సంబంధాల శాఖలో పనిచే యడం తనకు సంతప్తినిచ్చిందని వీరాంజనే యులు ఈ సందర్బంగా పేర్కొన్నారు. తన శేషజీవితాన్ని ప్రజాహిత సేవకే అంకితం చేస్తానన్నారు.