17-04-2025 01:18:08 AM
విద్యార్థి వీసాలపై పరిమితులు విధించడమే కారణం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఐదేళ్లలో తొలిసారిగా విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో తగ్గుముఖం కనిపించింది. ముఖ్యంగా వారు ప్రధానంగా వెళ్లే కెనడా, అమెరికా, యూకేల్లో వీసా తిరస్కరణలు కూడా కారణం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024లో ఈ మూడు దేశాల నుంచి భారతీయ విద్యార్థులకు లభించే స్టూడెంట్ వీసాల్లో 25 శాతం తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా కెనడా, యూకే దేశాలు విద్యార్థి వీసాలపై పరిమితులు విధించడం ఈ పరిస్థితికి కారణంగా నిలిచాయి.
కెనడా మధ్య ఉద్రిక్తతలు నెలకొనడం కూడా ఈ పరిస్థితికి తోడైంది. ముఖ్యంగా ఆ దేశంలో భారతీయ విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ప్రోగ్రామ్ను వేగవంతం చేసింది. భారతీయ విద్యార్థులకు కేటాయించే స్టడీ పర్మిట్లను 32 శాతం తగ్గించింది. ఇక యూకే కూడా విదేశీ విద్యార్థులు వారిపై ఆధారపడిన వారిని తీసుకురాకుండా నిబంధనలు విధించింది.
ఈ కారణంతో ఆ దేశానికి వీసాకు దరఖాస్తు చేసేవారి సంఖ్య తగ్గింది. వాస్తవానికి కోవిడ్ తర్వాత 2023 నుంచే భారతీయులకు విద్యార్థి వీసాలు ఇవ్వడం తగ్గించింది. ఆ ఏడాది 13 శాతం తగ్గుదల కనిపించింది. గత పదేళ్లలో ఈ మూడు దేశాల్లో భారతీయ విద్యార్థులు సంఖ్య అత్యంత వేగంగా పెరిగింది.
ఒక దశలో చైనా విద్యార్థులను వీరు దాటేశారు. 2015 మధ్య కెనడా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య 31,920 నుంచి 2, 78, 160కు చేరుకొంది. ఇదే కాలంలో యూకేకు వెళ్లేవారి సంఖ్య 10,418 నుంచి 1,19,738 చేరుకొంది. యూఎస్కు 2015లో 74,831 మంది ఎఫ్1 వీసాపై వెళ్లగా.. 2023లో అది 1,30,730గా ఉంది.