మాజీ మంత్రి జగదీష్రెడ్డి
సూర్యాపేట, అక్టోబర్ 19 (విజయక్రాంతి): నమ్మిన వారిని మోసగించడం కాంగ్రెస్ పార్టీ నైజమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల బీఆర్ఎస్ పార్టీ వర్క్షాప్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన మొదటి నెల నుంచే మోసపోయామన్న భావన ప్రజల్లో మొదలైం దన్నారు. మాజీ సీఎం కేసీఆర్ను తామే దూరం చేసుకున్నామని ప్రజలు పశ్చాత్తాపడుతున్నారని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ శ్రేణులు ఐక్యతను కోల్పోవద్దని సూచించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు అయ్యేంతవరకు పోరాడుతామన్నారు. అభివృద్ధి మరిచి హైడ్రాతో తప్పుదోవ పట్టిసు ్తన్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్తోనే సాధ్యమన్నారు.