హాస్టల్ పై నుంచి దూకి బీపీవో ఉద్యోగి ఆత్మహత్య
రాజేంద్రనగర్, అక్టోబర్ 2౫: ఆన్లైన్ గేమ్స్ మోజులో అప్పులు కావడంతో మనస్తాపం చెందిన ఓ బీపీఓ ఉద్యోగి హాస్టల్ ఏడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆంధ్రప్రదేశ్ తణుకు ప్రాంతానికి చెందిన నాగప్రసాద్ (25) కొన్నిరోజులుగా నార్సింగి మున్సిపల్ పరిధిలోని గౌలిదొడ్డిలోని విరూపాక్ష హాస్టల్లో ఉంటూ కోకాపేటలోని ఓ బీపీఓ సంస్థలో టెలీకా లర్గా ఉద్యోగం చేస్తున్నాడు.
గురువారం ఉదయం అతడు విరూపాక్ష హాస్టల్లోని ఏడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ గేమ్స్ మోజులో అప్పులు చేయడంతో మనస్థాపం చెంది ఉంటాడని అతడి సన్నిహితులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.