24-03-2025 10:59:18 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభలో రెండో రోజు బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగుతుంది. పురపాలక, సంక్షేమ, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పద్దులపై, పురపాలక-పంచాయతీరాజ్ చట్ట సవరన బిల్లులపై చర్చించారు. తెలంగాణ రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ వాయిదా తీర్మానం చేశారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించారు. ఇదెలా ఉండగా మరోవైపు జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత, ఇంటి స్థలంతో పాటు సదుపాయాలు, పెన్షన్ పథకం, సంక్షేమ చర్యలపై శాసనసభలో సీపీఐ వాయిదా తీర్మానం చేసింది.