calender_icon.png 4 October, 2024 | 2:58 AM

శిశువు మృతి.. దవాఖాన ముందు ఆందోళన

04-10-2024 12:00:00 AM

వనపర్తి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన (ఎంసీ హెచ్) ముందు బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. వీపనగండ్ల మండలం పెద్దదగడ గ్రామానికి చెందిన అనూష, రాకేష్ దంపతులు వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మూడు రోజుల క్రితం వచ్చారు.

బుధవారం రాత్రి వరకు సాధారణ కాన్పు కోసం చూశారని, రాత్రి సిజరేయన్ చేయగా అప్పటికే శిశువు మృతి చెందిందని, వైద్యుల నిర్లక్ష్యం వల్లనే శిశువు మృతి చెందిందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై మాతా శిశు సంరక్షణ కేంద్రానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.