calender_icon.png 17 October, 2024 | 11:57 PM

రీల్స్ పిచ్చితో ప్రాణాంతక స్టంట్స్

16-10-2024 02:08:02 AM

రాజేంద్రనగర్, అక్టోబర్ 15: రీల్స్ పిచ్చితో కొందరు యువకులు నగరంలో ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోని పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ రోడ్డుపై వీరి స్టంట్స్ మరీ ఎక్కువగా ఉంటున్నాయి. కొందరు యువకులను బైక్‌లను వేగంగా నడుపుతూ, ప్రమాదకరంగా వంచుతూ వెళ్తున్నారు. ఒకరు వాహనం నడుపుతుండగా, వెనుక మరో వాహనంపై వచ్చే వారు ఆ స్టంట్స్‌ను మొబైల్స్‌లో చిత్రీకరిస్తున్నారు.

ఈ పక్క చిత్రంలో కనిపిస్తున్న స్టంట్ మంగళవారం తెల్లవారుజామున డెయిరీ ఫామ్ చౌరస్తాలో స్థానికులకు కనిపించింది. స్టంట్‌ను చూసి స్థానికులు బెంబేలెత్తారు. యువకులు తమ స్టంట్స్ తమ ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలకు చేటు చేకూరుస్తారని, పోలీసులు అలాంటి వారిపై నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.