calender_icon.png 30 September, 2024 | 8:55 AM

ప్రాణంతీసిన చేపల వేట

30-09-2024 12:00:00 AM

హస్నాబాద్ చెరువులో మునిగి వ్యక్తి మృతి 

కొడంగల్, సెప్టెంబర్29 (విజయక్రాంతి): చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన కొడంగల్ మండలం గుం డ్లకుంటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుండ్లకుం ట గ్రామానికి చెందిన మాలెల ఊశప్ప(40) స్నేహితులతో కలిసి హస్నాబాద్ చెరువులో చేపల వేటకు వెళ్లాడు.

వలలను నీటిలో వేసే క్రమం లో ఊశప్ప ప్రమాదవశాత్తు చెరువులోకి జారపడిపోగా పూడిక తీసిన పెద్దగుంత ఉండటంతో అందు లో ఇరుక్కొనిపోయాడు. అప్పటికే రాత్రి కావడంతో అతడి స్నేహితులు ఎంత వెతికినా ఊశప్ప కన్పించలేదు. ఆదివారం ఉదయం పోలీసుల సహకా రంతో చెరువులోకి దిగి వెతకగా ఊశప్ప శవం లభ్యమయ్యింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యానారయణ తెలిపారు.