హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): 2024 విద్యాసంవత్సరా నికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశాల గడువును బోర్డు అధికారులు మరోసారి పొడిగించారు. రూ.500 అపరాధ రుసుము తో ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఇదే చివరి అవకాశమని మంగళవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.