calender_icon.png 20 September, 2024 | 10:04 AM

గండిపేట చెరువులో యువతి మృతదేహం

19-09-2024 12:11:07 AM

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 18: గండిపేట చెరువులో ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైం ది. ఎస్సై మురళీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోలింగ్ సిబ్బంది బుధవారం నెమలి ఫాంహౌస్ సమీపంలో గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో పోలీస్ సిబ్బందికి గండిపేట చెరువులో తేలియాడుతున్న మృతదేహం కనిపించింది. వెంటనే సిబ్బంది అక్కడికి వెళ్లి స్థానికుల సాయంతో మృత దేహాన్ని బయటకు తీయించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  మృతురాలి వయస్సు 25 ఏళ్ల మధ్య ఉంటుందని, ఆమె రెండు వారాల క్రితం మృతిచెంది ఉంటుందని ఎస్సై తెలిపారు.