యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): యాదగిరి గుట్ట పట్టణం గుండ్లపల్లి పరిధిలో ఉన్న నల్ల చెరువు లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం కుళ్ళిపోయిన స్థితిలో లభించిది. నీటిలో తేలిన సుమారు 40-45 సంవత్సరాల, మొఖం ఉబ్బిపోయిన స్థితిలో ఉండి గుర్తుపట్టలేనంతగా ఉన్నది. ఒంటిపై కేవలం నలుపు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నది. ఎడమ చేతిపై ఎమ్మెల్యే అనే పచ్చబొట్టుఉంది. అలాగే రెండు చెవులకు రింగ్స్ ఉన్నాయి. గుర్తు తెలియని మృతదేహంపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తునట్టు సి ఐ రమేష్ తెలిపారు.