నిర్మల్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని సారం గాపూర్ మండలం బోరిగాం శివారులో గురువారం రాత్రి ఏడు నెలల పసికందు మృతదేహం లభ్యమైంది. గ్రామ సమీపంలో ఉన్న కల్వర్టు వద్ద ఉన్న నీటిలో గుర్తుతెలియని వ్యక్తులు మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్లారు. తర్వాత మృతదేహం నీటిలో తేలగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మగ శిశువు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదుచేసి, విచారణ జరుపుతున్నారు.