calender_icon.png 22 September, 2024 | 2:17 PM

ఇందల్వాయి రైల్వేస్టేషన్ వద్ద మృతదేహాలు లభ్యం

13-07-2024 02:35:53 PM

ఇందల్వాయి : నిజామాబాద్ జిల్లాలో రెండు మృతదేహాలు శనివారం కలకలం రేపాయి. ఇందల్వాయి రైల్వేస్టేషన్ వద్ద రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. రైల్వే ట్రాక్ పక్కన డ్రైనేజీలో పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను బయటికి తీశారు. 

శుక్రవారం రాత్రి రైలు నుంచి కిందకి జారిపడినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాల వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.