హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ఈస్ట్ హైదరాబాద్లోనే మొదటిసారిగా 52 సంవత్సరాల మహిళకు హైపెక్ సర్జరీని విద్యానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామానికి చెందిన నాయిని లలిత(52) ‘సూడోమైక్సోమా పెరిటోని’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని తప్పనిసరిగా శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు సూచించారు.
దీంతో శస్త్ర చికిత్స కోసం ఖమ్మంలోని ప్రముఖ హాస్పిటల్స్ను ముందుగా వారు సంప్రదించగా వ్యాధి ముదిరినందున చికిత్స ఖర్చు లక్షల్లో అవుతుందని తెలిపారు. దీంతో వారు దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్లో సంప్రదించారు. కేసును పరిశీలించిన డైరెక్టర్ అండ్ సీనియర్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజీ చికిత్స నిపుణులైన డా.ఆజాద్ చంద్రశేఖర్ కేసును ఒక ఛాలెంజ్గా తీసుకుని శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు.