24-03-2025 10:38:08 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని నూతన కూరగాయల మార్కెట్ భవనంలో సోమవారం నూతన సీసీ కెమెరాలను మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ ప్రారంభించారు. 16 సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల దొంగతనాలు, నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉండదని డిసిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య, ఎస్ఐ రాకేష్, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.