28-03-2025 01:14:54 PM
మంచిర్యాల, (విజయక్రాంతి) : పదవ తరగతి పరీక్ష కేంద్రాలను మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్(Mancherial DCP Aggadi Bhaskar) శుక్ర వారం పరిశీలించారు. సిసిసి నస్పూర్ సింగరేణి కాలరీస్ హై స్కూల్ లోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా లోపాలు ఉండకుండా పర్యవేక్షణ చేయాలని సూచించారు. డీసీపీ వెంట మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, సిబ్బంది ఉన్నారు.