18-02-2025 04:16:28 PM
ఆదిలాబాద్, (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలను ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజా రెడ్డి కలిశారు. హైదరాబాదులోని సచివాలయంలో మంగళవారం సీఎం, డిప్యూటీ సీఎం లతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao), జూపల్లి కృష్ణారావు, జానారెడ్డిలను రాష్ట కో ఆపరేటివ్ ఆపెక్స్ బ్యాంకు చైర్మన్ రవీందర్ రావుతో కలిసి తమ పదవీ కాలాన్ని 6 నెలలు పొడగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం,డిప్యూటీ సీఎం, మంత్రులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల చైర్మన్ లు ఉన్నారు.