calender_icon.png 22 October, 2024 | 7:05 PM

గ్రూపు రాజకీయాల్లో బలి పశువునయ్యా..

22-10-2024 04:43:35 PM

జనగామ,(విజయక్రాంతి): జనగామ నియోజకవర్గ అభివృద్ధి డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్​రెడ్డితోనే సాధ్యమని, ఆయన నాయకత్వంలోనే తాను పనిచేస్తానని డీసీసీ కార్యదర్శి చిర్ర హనుమంత్ ​రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కొమ్మూరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకున్నారు. కొందరి ప్రోద్బలం వల్లే అసత్య ఆరోపణలు చేశానన్నారు. మంగళవారం ఆయన తన సతీమణి మల్లికాంబతో కలిసి జనగామలో విలేకరులతో మాట్లాడారు. జనగామలో కొందరు నాయకులు గ్రూపులుగా ఏర్పడి కాంగ్రెస్​ను, కొమ్మూరిని బ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

అందులో భాగంగా తనను బలి పశువును చేసి కొమ్మూరిపై అసత్య ఆరోపణలు చేయించారన్నారు. తన భూవివాదంలో డీసీసీ అధ్యక్షుడికి ఎలాంటి సంబంధం లేకున్నా, ఆయనను వివాదంలో లాగడం బాధేసిందన్నారు. 2013 నుంచి తాను కొమ్మూరికి సన్నిహితుడిగా ఉంటున్నానని, అందుకే ఆయన వ్యతిరేక వర్గం తనను టార్గెట్​ చేసి కొమ్మూరికి దూరం చేసిందని వాపోయారు. తాను మనస్ఫూర్తిగా కొమ్మూరికి క్షమాపణ చెబుతున్నానని, ఇక నుంచి ఆయన నాయకత్వంలోనే తాను పనిచేస్తానని హనుమంత్​రెడ్డి పేర్కొన్నారు.