23-04-2025 06:10:33 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా దిమ్మదుర్తి గ్రామానికి చెందిన టి గంగుబాయి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా బుధవారం డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కొట్టే శేఖర్ తదితరులు ఉన్నారు.