ముంబై, సెప్టెంబర్ 26: శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్రౌత్కు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధ దాఖలు చేసిన పరువునష్టం కేసులో రౌత్కు 15రోజుల జైలుశిక్షతో పాటు రూ.25వేల జరిమానా విధిస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. మేధ సోమ య్య ముంబైలోని రుయా కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమె యువ ప్రతిష్ఠాన్ అనే స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు. ఆమె ముంబై శివారులోని మీరా భయందర్లో రూ. 100 కోట్ల టాయిలెట్ స్కామ్కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ సామ్నా ప్రతిక లో కథనాలు వచ్చాయి. ఈ స్కామ్తో సోమయ్య కుటుంబసభ్యులకు చెందిన యువ ప్రతిష్ఠాన్ స్వచ్ఛంద సంస్థకు సంబంధం ఉందంటూ రౌత్ ఆరోపించారు. ఈ క్రమంలో మేధా సోమయ్య 2022 ఏప్రిల్లో ముంబై హైకోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.