calender_icon.png 9 October, 2024 | 3:56 AM

కోడలు కేసు పెట్టిందని..

09-10-2024 01:44:53 AM

అత్తమామ సహా భర్త ఆత్మహత్యాయత్నం

ముగ్గురి పరిస్థితి విషమం 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8 (విజయక్రాంతి): కోడలు తమపై పోలీసు కేసు పెట్టిందని.. దీంతో కుటుంబపరువు పోయిందని ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేయడం సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది.

పోలీసుల కథ నం ప్రకారం.. నాగోల్‌కు చెందిన పద్మావతి, నారాయణ, వారి కుమారుడు సుజన్ మూడు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని తాజ్ త్రీ స్టార్ హోటల్‌లో ఒక గదిలో దిగా రు. సుజన్‌కు ఇటీవల కొత్తగూడెంకు చెందిన కావ్యశ్రీతో వివాహం జరిగింది. అయితే, అత్తింటివారు తనని వేధిస్తున్నారంటూ ఆమె నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో భయాందోళనకు గురైన సుజన్, అతడి కుటుంబ సభ్యులు హోటల్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మంగళవా రం ఉదయం వారిని అపస్మారక స్థితిలో  గుర్తించిన హోటల్ సిబ్బంది వెంట నే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడకు చేరుకు న్న పోలీసులు వారిని మొదటగా యశోద ఆసుపత్రికి తరలించి అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కూల్‌డ్రింక్‌లో విషం కలిపి తాగినట్ల్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా నే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. హోటల్ గదిలో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించిం ది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.