calender_icon.png 24 October, 2024 | 8:47 PM

కుమార్తెకు జ్వరం.. వినూత్నంగా నిరసన

29-08-2024 03:57:35 AM

కామారెడ్డి, ఆగస్టు 28 (విజయక్రాంతి): తన కుమార్తెకు జర్వం వస్తే వైద్యులు చికిత్స అందించడం లేదని ఓ తండ్రి దవాఖానలోకి ఎవరూ వెళ్లకుండా ఎదుట తోపుడు బండ్లు పెట్టి నిరసన తెలిపాడు. తెలిసిన వివరాల ప్రకారం.. పిట్లం గ్రామానికి చెందిన కిరణ్ కుమార్తె అవంతిక కొద్దిరోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నది. దీంతో తండ్రి ఆమెను ఇటీవల స్థానిక సీహెచ్‌సీకి తీసుకొచ్చాడు. వైద్యులు కుమార్తెకు చికిత్స అందించడం లేదని విసిగిపోయి బుధవారం దవాఖాన ఎదుట రెండు, మూడు తోపుడు బండ్లు పెట్టి నిరసన వ్యక్తం చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిరణ్‌కు నచ్చజెప్పి తోపుడు బళ్లను తీయించారు. కుమార్తెకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.