calender_icon.png 21 September, 2024 | 8:08 PM

అంతర్జాతీయ స్థాయిలో దాశరథి కీర్తి

26-07-2024 01:21:37 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): మహాకవి దాశరథి కృష్ణమా చార్య ప్రయాణం గ్రామస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు సాగిందని ఆచార్య ఎస్‌వీ సత్యనారాయణ అన్నారు. దాశరథి సాహిత్య సమాలోచన ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాల యం తెలుగు శాఖ ఆధ్వర్యంలో దాశరథి కవిత్వంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య ఎస్‌వీ సత్యనారాయణ దాశరథి కవితలోని గొప్పతనాన్ని తెలిపారు.

ప్రధాన వక్తగా పాల్గొన్న డాక్టర్ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ.. దాశరథి పద్యం, గేయం మాదిరిగానే వచన కవిత్వాన్ని కూడా విరివిగా రాసిన మహనీయుడని అన్నారు. అ నంతరం సాహిత్య అకాడమీ కార్యదర్శి ఎన్ బాలచారి ప్రసంగిస్తూ.. సాహిత్య అకాడమీ లక్ష్యాన్ని చెబుతూ దాశరథి సాహిత్యాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే విద్యాలయాల్లో సభలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మోత్కూరి నరహరి, ఆచార్య పిల్లలమర్రి రాములు, విశ్వవిద్యాల య ఆచార్యులు డాక్టర్ భుజంగరెడ్డి, డాక్టర్ త్రివేణి, వారిజారాణి, విజయ్‌కుమార్, సోమశిల తిరుపాల్ పాల్గొన్నారు.