calender_icon.png 28 October, 2024 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో అంధకారం

01-09-2024 12:43:06 PM

చీకట్లోనే చికిత్స.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోగులు

భద్రాద్రికొత్తగూడెం,విజయక్రాంతి: కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ప్రధాన ఆసుపత్రి అంధకారంలో మగ్గుతోంది. సింగరేణికే తలమానికంగా ఉన్న ప్రధాన ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు అత్యవసరంగా చికిత్స అందించే ఐసీయూ విభాగం లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

చికిత్స కోసం వచ్చిన రోగులు, చికిత్స అందించే సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి సిబ్బంది ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రానికే విద్యుత్ వెలుగులు అందించే సింగరేణి సంస్థకి ఇలాంటి దుస్థితి ఏమిటని కార్మికులు చర్చించుకుంటున్నారు. ఏదైనా కారణాలతో విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ కనీసం జనరేటర్ ని ఏర్పాటు చేయకపోవడం పట్ల రోగులు, రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.