01-05-2024 12:12:45 AM
మంచిర్యాల, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): మంచిర్యాల మిమ్స్ కాలేజీ డిగ్రీ విద్యార్థి డేనియల్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపికయ్యాడు. కాకతీయ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన అంతర్ జిల్లాల సాఫ్ట్బాల్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచాడని ప్రిన్సిపల్ ఉపేందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. మేలో బెంగళూర్లో జరిగే పోటీలలో డేనియల్ పాల్గొననున్నట్టు చెప్పారు. విద్యార్థిని కరస్పాండెంట్ శ్రీనివాసరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్రావు, పీడీ శ్రీనివాస్ తదితరులు అభినందించారు.