calender_icon.png 21 October, 2024 | 3:18 AM

దత్తాత్రేయ కాన్వాయ్‌కి ప్రమాదం

21-10-2024 12:40:34 AM

శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిలో ఘటన 

రాజేంద్రనగర్, అక్టోబర్ 20: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ స్వల్ప ప్రమాదానికి గురైంది. ఈ ఘటన ఆదివారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు దత్తాత్రేయ తన కాన్వాయ్‌తో శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌కు బయలుదే రారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులోని ప్రధాన రహదారిలో ఓ కారు డ్రైవర్ సర్ఫరాజ్ ఖాన్.. రోడ్డు ఇరుకుగా ఉండటంతో అకస్మాత్తుగా ఎడ మవైపు తీసుకొని గవర్నర్ కాన్వాయ్ మధ్యలోకి వచ్చాడు.

దీంతో కాన్వాయ్‌లోని బుల్లెట్ ప్రూఫ్ కారు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఈ క్రమంలోనే గవర్నర్ కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భద్రతా సిబ్బంది స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ బాలరాజు తెలిపారు.