బెల్లంపల్లి (విజయక్రాంతి): కాసిపేట మండలంలోని సల్పల వాగు వద్ద గల వెంకటాద్రి దేవాలయంలో ఆదివారం ఆదివాసీల దండారి సంబరాలు మొదలయ్యాయి. కాసిపేట మండలంలోని ఆదివాసి గ్రామాలనుండి గుస్సాడి నృత్యాలతో కళాకారులు దేవాలయం వద్ద పూజలు నిర్వహించారు. ఆదివాసి కళాకారులు డప్పు చప్పుళ్ళ మధ్య గుస్సాడీ నృత్యాలను ప్రదర్శించారు. ప్రతీ ఏటా దీపావళి పండుగకు ముందు ఆదివాసీలు గుస్సాడీ గుత్యాల మధ్య ఘనంగా వెంకటాద్రి దేవాలయంలో పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాల వేడుకైన దండారి దర్బార్ లో ఆదివారం సాయంత్రం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొనబోతున్నారు.