డ్యాన్స్ లవర్స్ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్’ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్కు రెడీ అవుతోంది. ఈ షోకు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్లుగా వ్యవహరిస్తున్నారు. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టుల్స్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకోనున్నాయి. ఈ నేపథ్యంలో డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ప్రెస్మీట్ను ఈరోజు హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓంకార్ మాట్లాడుతూ.. “డ్యాన్స్ ఐకాన్ 1’ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్’ను మీ ముందుకు తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఫరియా అబ్దుల్లా హోస్ట్గా చేస్తుండటం హ్యాపీగా ఉంది. శేఖర్ మాస్టర్ సెకండ్ టైమ్ ఈ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్’ మీకు ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్.. ఇలా మీకు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుంది.
‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్’లో ఐదుగురు కంటెస్టెంట్స్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తారు. పంచభూతాల్లాంటి వారి పెర్ఫార్మెన్స్ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా ఇద్దరు పిల్లల పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ముగ్గురు హోస్ట్లతోపాటు మరో నలుగురు మెంటార్స్ ఉంటారు. సింగర్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్గా ఉంటారు. ‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్’లో ఫస్ట్ రౌండ్ విజేతలను మెంటార్స్ నిర్ణయిస్తే, సెకండ్ రౌండ్లో ఎవరు విజేతలు అనేది ప్రేక్షకులు తమ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు” అన్నారు. ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. “డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’ టైమ్లో కూడా నన్ను హోస్ట్గా అడిగారు. అప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ వల్ల సీజన్ 1 చేయలేకపోయాను. ఇప్పుడు ‘డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్’లో హోస్ట్గా చేస్తుండటం సంతోషంగా ఉంది. ప్రతి ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. ఆ కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్ చూసేందుకు వెయిట్ చేస్తున్నా. నేను హీరోయిన్గా సినిమాలు చేయడాన్ని ఎంతగా ఎంజాయ్ చేస్తానో అలాగే ఇలాంటి షోస్ చేయడాన్ని కూడా ఎంజాయ్ చేస్తాను” అన్నారు. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘ఈ షోలో తీసుకున్న పంచభూతాల కాన్సెప్ట్ పేరుకు తగినట్లే ఐదుగురు కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా సెట్ అయ్యింది’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మెంటార్స్ యష్ మాస్టర్, మానస్, ప్రకృతి, సింగర్ జాను లైరి తదితరులు పాల్గొన్నారు.