calender_icon.png 20 September, 2024 | 8:50 PM

దానం కంగనాకు క్షమాపణలు చెప్పాలి

20-09-2024 01:27:52 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ మహిళా మోర్చా ఖండించింది. కంగనాకు దానం నాగేందర్ క్షమాపణలు చెప్పాలని గురువారం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. శిల్పారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద మహిళా మోర్చా నేతలు ఆందోళనకు దిగారు. అనంతరం దానం దిష్టిబొమ్మ దహనం చేశారు. దానం చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ముఖ్యంగా మహిళలను కించపర్చేలా ఉన్నాయని శిల్పారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి.. ఇలాంటి చౌకబారు కామెంట్లు చేయడం తగదన్నారు. ‘వేశ్య పాత్రలు వేసే కంగనాకు రాహుల్ గాంధీని విమర్శించే అర్హత లేదు’ అని దానం చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.