calender_icon.png 8 October, 2024 | 5:12 PM

దళితులు ఏం తింటున్నారో తెలియదు!

08-10-2024 01:41:59 AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

కోల్హాపూర్, అక్టోబర్ 7: దళితులు నేటికీ దీనావస్థలో ఉన్నారని, వాళ్లు ఏం తింటున్నారో కూడా చాలా మందికి తెలియదని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్‌లో నివాసముంటున్న ఓ దళిత కుటుంబం ఇంటికి వెళ్లిన రాహుల్.. వారితో కలిసి హర్బారీచి భాజీ (శనిగలతో చేసిన వంటకం)ని రుచి చూశారు. ఈ మేరకు వీడియోను సోమవారం ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

ఇంటి యజమాని సంజయ్, ఆయన భార్య అంజనతో కలిసి సరదాగా గడిపిన రాహుల్.. వారి ఆహార అలవాట్లు, వంటలు వండే విధానాన్ని కుతూహలంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మరాఠీ రచయిత సాహూ పటోలే దళితుల స్థితిగతులు, వారి వంటకాలపై రాసిన ‘దళిత్ కిచెన్స్ ఆఫ్ మరాఠ్వడ’ పుస్తకాన్ని ప్రస్తవించారు. ఓ దళిత ఇంట్లో చేసిన భోజనం కొత్త అనుభూతిని అందించిందని చెప్పారు.