calender_icon.png 30 September, 2024 | 12:49 PM

మిధున్ చక్రవర్తికి 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు

30-09-2024 10:26:30 AM

న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు, రాజకీయవేత్త మిథున్ చక్రవర్తి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఉత్తేజకరమైన వార్తను పంచుకున్నారు. అక్టోబర్ 8న మిథున్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. ఫాల్కే అవార్డును మిథున్ ఎంపికైనట్లు అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఈ ఏడాది జనవరిలో మిథున్ చక్రవర్తి పద్మభూషణ్ అందుకున్నారు. ఒకే ఏడాది 19 చిత్రాల్లో మిథున్ నటించి బాలీవుడ్ లో రికార్డు సృష్టించారు. 1976లో మిథున్ చక్రవర్తి సనీ ప్రస్థానం ప్రారంభించారు. హిందీ, బెంగాల్, తెలుగులో మిథున్ చక్రవర్తి నటించారు. 'గోపాల గోపాల' చిత్రంలో మిథున్ చక్రవర్తి అందరినీ అలరించారు. మిథున్ చక్రవర్తి 3 నేషనల్ ఫిల్మ్ అవార్డులు, 2 ఫిల్మ్ ఫేర్ అవార్డులు తన ఖాతాలో వేసుకున్నారు.