హైదరాబాద్,(విజయక్రాంతి): రాజస్థాన్ లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. పెట్టుబడులు, ఫెడెక్స్ వంటీ సైబర్ నేరాలకు పాల్పడుతున్న 27 మంది సైబర్ నేరగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీగా బ్యాంకు చెక్ బుక్స్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యారో డైరెక్టర్ శిఖా గోయల్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడించునున్నారు.