calender_icon.png 24 September, 2024 | 1:47 AM

ముక్కలుగా నరికి.. ఫ్రిడ్జ్‌లో పెట్టి..

22-09-2024 12:02:29 AM

బెంగళూరు, సెప్టెంబర్ 21: ఢిల్లీ శ్రద్ధావాకర్ తరహాలో బెంగళూరులో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. నగరంలోని మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటున్న 29 ఏళ్ల మహిళను హత్య చేసి దాదాపు 30 ముక్కలుగా నరికారు. ఆ తర్వాత వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలిని మహాలక్ష్మిగా గుర్తించారు. ఆమె మృతదేహం ఛిద్రమైన స్థితిలో లభించినట్లు తెలిపారు. మహాలక్ష్మికి ఇదివరకే పెళ్లి కాగా వ్యక్తిగత కారణాలతో బిడ్డతో పాటు మునేశ్వర్‌నగర్‌లో 5 నెలలుగా ఒంటరిగా ఉంటోంది. ఆమె భర్త హుకుమ్‌సింగ్ నేలమంగళంలో నివసిస్తున్నాడు.

అయితే, బాధితురాలికి ఆమె తల్లి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానంతో ఇంటికి వచ్చి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితమే ఆమె హత్యకు గురైనట్లు తెలుస్తోంది. దుండగులు దుర్వాసన రాకుండా రసాయనాలు చల్లి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. బాధితురాలి ఫోన్ సెప్టెంబర్ 2న స్విచ్ఛాఫ్ అయిందని, అదే రోజు హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.