భద్రాద్రి బ్యాంక్ వార్షికోత్సవంలో చైర్మన్ కృష్ణమూర్తి
ఖమ్మం, అక్టోబర్ 4 (విజయక్రాంతి): గత 28 ఏళ్లుగా ఖాతాదారుల నమ్మకమే ప్రమాణంగా విస్తృత సేవలందిస్తూ ప్రథమ శ్రేణి బ్యాంక్గా రిజర్వ్బ్యాంక్ చేత గుర్తింపు పొందామని, అదే భద్రాద్రి బ్యాంక్ ఘన కీర్తి అని బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అన్నారు. బ్యాంక్ 28వ వార్షికోత్సవం శుక్రవారం ఖ మ్మం గాంధీచౌక్లోని బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భ ంగా చెరుకూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. తమ బ్యాంక్ 17 బ్రాంచ్లతో రూ.950 కోట్ల టర్నోవర్తో నడుస్తున్నదన్నారు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, అన్ని రకాల రుణాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మూలధనంపై అత్యధికంగా డివిడెండ్ 18 శాతం కలిగి ఉన్నదన్నారు.
ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, కరీం నగర్, సూర్యాపేట జిల్లాల్లో తమ బ్యాంక్ సేవలు అందిస్తుందని అన్నారు. త్వరలో మరో ఐదు జిల్లాల్లో నూతన శాఖల ఏ ర్పాటుకు ఆర్బీఐ ఆమోదం తెలిపిందన్నారు. భవిష్యత్లోనూ ఖా తాదారులకు అత్యుత్తమ ప్రమాణాలతో సేవలు అందిస్తామని సీఈవో దాసరి వేణుగోపాల్ తెలిపారు.
ఈ సందర్భం గా చెరుకూరి కృష్ణమూర్తిని శాలువాతో సిబ్బ ంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ ఉదయ్ప్రతాప్, వేములప ల్లి వెంకటేశ్వరరావు, డైరెక్టర్స్ బలుసు సాంబమూర్తి, దేవత రాజారావు, కె.నర్మద, కె.జయప్రద, మద్ది పిచ్చయ్య, రేఖల భాస్కర్రావు, డీజీఎం ఎల్విఎస్ ప్రసాద్, మేనేజర్లు శ్యామ్, రామారావు, ఎం.వి.సత్య నారాయణ, నర్సింగరావు పాల్గొన్నారు.