calender_icon.png 22 October, 2024 | 5:22 AM

కులవృత్తులు దేశానికి పట్టుకొమ్మలు

22-10-2024 12:21:51 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, అక్టోబర్21 (విజయక్రాంతి): కులవృత్తులు దేశానికి పట్టుకొమ్మలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీర్‌పేట్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె గీత కార్మికులకు రక్షణ కవచాన్ని అందించారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కులవృత్తులకు పెద్దపీట వేసిందన్నారు. గీతాకార్మికుల కష్టాలను దూరం చేసేందుకు ప్రత్యేక చొరవ చూపిందని తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ కులవృత్తులను విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.