వికారాబాద్ రూరల్, జూలై 14: జిల్లాలో ఆదివారం ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్వహించిన దాడిలో గంజాయితో పాటు, విత్తనాలు పట్టుబడ్డాయి. పూడూరు మండలం మీర్జాపూర్కు చెందిన మహ్మద్ ఆసీప్ ఇంట్లో గంజాయితో పాటు, గంజాయి విత్తనాలు ఉన్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. గంజాయితో పాటు, విత్తనాలు లభించినట్లు తెలిపారు. మహ్మద్ ఆసీప్ ఇచ్చిన సమాచారం మేరకు చేవెళ్ల మండలం అంతారం గ్రామానికి చెంది న షేర్కాన్ ఇంట్లో దాడులు నిర్వహించి గంజాయితో పాటు, విత్తనాలు స్వాధీనం చేసుకు న్నట్లు తెలిపారు. నిందితులిద్దరిని అరెస్టు చేసినట్లు టాస్క్ఫోర్స్ సూపరింటెండెంట్ ఎస్ శ్రీనివాస్రెడ్డి తెలిపారు