హైదరాబాద్: గ్రూప్ -1 మెయిన్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఎస్ శాంతి కుమారి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో టీజీపీఎస్సీ ఛైర్మెన్ మహేందర్ రెడ్డి, కార్యదర్శి నవీన్ నీకోలస్ డీజీపీ జితేంద్ర, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టర్లు పాల్గొన్నారు.